News

లాలూ ప్రసాద్ యాదవ్ కుట్ర ఇదే


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంతోపాటు మరో 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదు చేసింది. రాంచీ, పూరీలలోని రెండు రైల్వే హోటళ్ళ నిర్వహణ బాధ్యతను వినయ్ కొచ్చార్, విజయ్ కొచ్చార్‌ల యాజమాన్యంలోని సుజాత హోటల్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. దీనికి ప్రతిఫలంగా డిలైట్ అనే ఓ బినామీ కంపెనీ ద్వారా 3 ఎకరాల భూమి రూపంలో లంచం తీసుకున్నారని పేర్కొంది. ఈ కేసులో ఇతర నిందితుల్లో లాలూ సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడ తేజస్వి, ఐఆర్‌‌సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీ.కే. గోయల్, లాలూ సహచరుడు ప్రేమ్ చంద్ గుప్తా సతీమణి సరళ గుప్తా ఉన్నారు. ప్రేమ్ చంద్ గుప్తా కూడా గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.